Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 రోజులైనా కనిపించని ఇద్దరి ఆచూకీ..
- బీజేపీ నేతే వారిని అపహరించాడా..!
- నిజామాబాద్ జిల్లా నవీపేటలో వీడని సస్పెన్స్
- కన్నీరు మున్నీరవుతున్న దళిత కుటుంబాలు
నిజామాబాద్ : బీజేపీ నేత భరత్ రెడ్డి ఇద్దరు దళితులను అవమానించిన ఘటన జరిగి పన్నెండు రోజులైనా ఇప్పటికీ వీడని మిస్టరీగా మారింది. బీజేపీ నేత భరత్రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా నియమించిన మూడు బృందాలు రంగంలోకి దిగాయి.ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. భరత్ రెడ్డి చేతుల్లో అవమానానికి గురైన ఆ ఇద్దరు దళిత యువకులు అదృశ్యమైపోయారు.వారు ఎమయ్యారు..?ఎవరైనా వారిని మట్టుబెట్టారా..?లేక భరత్ రెడ్డి భయపెట్టి దళితయువకుల్ని కిడ్నాప్ చేశాడా... అన్నదానిపై సస్పెన్స్ వీడటంలేదు.అయితే ఆ ఇద్దరు యువకుల కుటుంబాలకు మాత్రం కంటిమీద కునుకులే కుండా పోయింది.మా వాళ్లకు ఎలాంటి ప్రాణహాని లేకుండా కాపాడా లంటూ ఆ కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. భరత్ రెడ్డిపై కేసు బుక్ చేసినప్పుడే పోలీసుల సత్వరమే రంగంలోకి దిగిఉంటే..మా వాళ్ల ఆచూకీ తెలిసేదని వారు చెబుతున్నారు.ఇప్పుడు పోలీసులంతా మోడీ కుమార్తె ఇవాంక పర్యటనలో బిజీ అయి పోయారు. భరత్ రెడ్డి మాత్రం బీజేపీ అగ్రనేతల డెన్ లో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తు న్నారు. అయితే ఆ ఇద్దరు దళితులు ఎక్కడున్నారన్నదానిపై వారి బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.కాగా అక్రమంగా మట్టి తవ్వుతున్న వారిని అడ్డుకున్న ఆ ఇద్దరు దళిత యువకులను బీజేపీ లోకల్ లీడర్ భరత్ రెడ్డి దారుణంగా అవమానించిన విషయం విదితమే..