Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలల ముందే రిజర్వేషన్లు పూర్తి
- ప్రత్యేకం పేరుతో భారీగా వడ్డన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సంక్రాంతి పండగ దగ్గర పడుతుండటంతో సుదూర గ్రామాలు, పట్టణాలకు చెందిన వారు తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకుంటున్నారు.. దీంతో ప్రతి రోజు నడిచే రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లలోనూ రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రతియేటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, గుంతకల్ డివిజన్ల నుండి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న విషయం తెలిసిందే. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పండగకు రెండు నెలలు ముందుగానే దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమై అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఏయే ప్రాంతానికి ఎన్నెన్ని రైళ్లు నడుస్తాయన్నది కూడా దక్షిణ మధ్య రైల్వే సంస్థ ప్రకటిం చింది. అదనపు చార్జీలు వసూలు చేస్తుండడంతో ఈ సారి ఎక్స్ప్రెస్, సాధారణ రైళ్లకు కూడా అడ్వాన్స్ రిజర్వేషన్లు పూర్తయ్యాయి. రద్దీ పెరి గితే రైళ్లకు అదనపు కోచ్లను అటాచ్ చేయడమే కాకుండా ఇతర జో న్ల నుంచి ప్రత్యేక రైళ్లుతెప్పించి మేజర్ స్టేషన్ల మధ్య నడ పాలని అధికా రులు నిర్ణయించారు. స్వచ్భారత్ కార్యక్రమంలో భాగం గా అన్ని రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై చెత్తా చెదారం లేకుండా చర్యలు తీసు కుంటున్నారు. పోలీసు బలగాలను మోహరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ)్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) సిబ్బందితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించి సహకరించాల్సిందిగా కోరింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్చలు జరిపించింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఏకే.గుప్తా ఆరు డివిజన్లకు చెందిన డీఆర్ఎంలతో సమీక్షించారు. పండగ సందర్భంగా ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, రైలు పట్టాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. సిగలింగ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఏకే.గుప్తా ఆదేశించారు.
రిజర్వేషన్లు ఫుల్...తత్కాల్ పేరుతో భారీ వడ్డన
సంక్రాంతి పండగకు రెండు నెలల ముందుగానే టికెట్లు రిజర్వేషన్లు చేయించుకోవడం మొదలు కావడంతో ఇప్పటికే దాదాపు అన్ని ప్రధాన రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఏసీ, సెకెండ్ క్లాస్ వరకు టిక్కెట్లన్నీ రిజర్వేషన్లు పూర్తయ్యాయి. అయితే ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించే వారికి అధిక చార్జీలతో తత్కాల్ వడ్డన తప్పేలా లేదు. టూటైర్ ఏసీకి రూ.300 నుంచి రూ.400 వరకు, త్రీటైర్ ఏసీపై రూ.250 నుంచి 350 వరకు, స్లీపర్ క్లాసులో రూ.175 నుంచి దూరాన్ని బట్టి అధిక వడ్డన వేస్తున్నారు.