Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శతావధానంలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'నేనొక దారి తప్పిన బాటసారిని.. సాహితీ ప్రపంచాన్ని మరిచి ఈ దారిలోకి వచ్చాను'.. అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖ రరావు అన్నారు. ఆదివారం తెలంగాణ సారస్వత పరిషత్లో అవధాని జీఎం రామశర్మ శతావధానం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను పద్య రూపంలో వర్ణించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాలు, 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి లక్షలాది మంది తెలుగు అభిమానులు తెలుగు మహాసభలకు తరలి రావడం హర్షణీయమన్నారు. రవీంద్రభా రతి, తెలంగాణ సార స్వత పరిషత్, ఇందిరా ప్రియదర్శిని వేదికల్లో చోటు సరిపో లేనంత భాషాభిమానులు రావడం సంతోషంగా ఉంద న్నారు. సాహితీ ప్రియుల అభిమానం వల్లనే తెలుగు మహాస భలను ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. తనకు తెలుగు సాహిత్యం అంటే ఎంతో అభిమానమన్నారు. 30 ఏండ్ల ఈ దారిలోకి వచ్చాను
క్రితం సాహిత్యం పట్ల విపరీతమైన మక్కువ ఉండేదని, ఒకప్పుడు తనకు 3వేల పద్యాలు కంఠస్తంగా వచ్చేవని చెప్పారు. అలాగే ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు. ఇప్పుడు దారి తప్పి ఇలా అయ్యానని చమత్కరించారు. ఎప్పుడో నేర్చుకున్న సాహిత్యం, అందుకు సంబంధించిన పద్యాలను మర్చిపోలేదంటూ 'మనుచరిత్ర పారిజాత అపరహరణం'' లోని రెండు పద్యాలను సభలో చదివి వినిపించారు.
చివరి రోజున చరిత్రాత్మకమైన నిర్ణయాలు
మమ్మీ.. డాడీ అని పిలుస్తున్న ఈ కాలంలో తెలుగుకు ఇంకా అంత ప్రాచుర్యం ఉందా? తెలుగు మహాసభలు నిర్వహిస్తే ఆశించిన మేర ఆదరణ లభిస్తుందా? అని నందిని సిధారెడ్డిని ప్రశ్నించానని సీఎం చెప్పారు. కాని ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు లభిస్తున్న జనాధారణ చూసి తాను ఊహించింది తప్పని తెలుసుకున్నా.. సాహిత్యం గురించి కొంత ఆదరణ తగ్గింది.. ఇక ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. తెలుగు భాష పరిరక్షణ, భాషా పండితులకు సముచిత స్థానం కల్పించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.. మహాసభలు ముగింపు రోజున చరిత్రాత్మకమైన నిర్ణయాలు వెల్లడిస్తాం.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు హర్షించేలా తీర్మానాలు ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు.
సీఎస్కు ప్రత్యేక కృతజ్ఞతలు
తెలుగు మహాసభలకు హాజరవుతున్న భాషా పండితులు, అభిమానులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్కు సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాషపై ఉన్న మమకారంతో సీఎస్ ఆహ్వానితులకు భోజనాన్ని అందించే ఏర్పాట్ల బాధ్యతను తీసుకోవడం ప్రశంసానీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఎంపీ కె కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.