Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోడీ పనితీరుకు మెచ్చిన ప్రజలు గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపిని గెలిపించారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కె లక్ష్మణ్ తెలిపారు. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి గెలుపొందడంతో నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో విజయానికి కార్యకర్తలు ఎంతో కషి చేశారని అభినందించారు. అభివద్ధి ఎజెండా ముందు కాంగ్రెస్ నేతల జిమ్మిక్కులు పనిచేయలేదన్నారు. అరువు తెచ్చుకున్న హార్దిక్ పటేల్ వంటి నేతలు కాంగ్రెస్కు విజయం సాధించక లేక పోయారని విమర్శించారు. మోదీ చేసిన అభివ ద్ధిని ప్రజలు మర్చిపోలేదని, గుజరాత్ తరహా పాలన దేశమంతటా వ్యాపిస్తోందన్నారు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ ముక్తి భారత్ ఏర్పడడానికి ఎంతో దూరం లేదన్నారు. సమావేశంలో కేంద్రమాజీ మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, రాంచంద్రారెడ్డి, ఎన్ రాంచందర్రావు, దొంతిరి శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.