Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరకు సీఎం కేసీఆర్ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ ఆహ్వానించారు. మేడారం ఆలయ ట్రస్టు చైర్మెన్ లింగయ్య, ప్రధాన పూజారి జగ్గారావుతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్కు మంత్రులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. జాతర ఏర్పాట్లను కడియం సీఎం కేసీఆర్కు వివరించారు.
అనంతరం రాజ్భవ న్లో గవర్నర్ నరసింహన్ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. గవర్నర్ను కలిసిన వారిలో దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, మేడారం ట్రస్ట్ సభ్యులు, ప్రధాన పూజారి జగ్గారావు ఉన్నారు.