Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రకటించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 27 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి ఎ వాణీప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 27 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల రిజిస్టర్ నెంబర్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.
24న ఏఈఈ అభ్యర్థులకు ఇంటర్వ్యూ
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ)లో ప్రకటించిన అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24న ఉదయం, మధ్యాహ్నం హైదరాబాద్లోని ప్రతిభ భవన్ (టీఎస్ పీఎస్సీ కార్యాలయం)లో ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. షెడ్యూల్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు.