Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాపరిరక్షణ కమిటీ ప్రతినిధులతో హెచ్సీయూ వీసీ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ప్రొఫెసర్ లక్ష్మీనారాయణపై ఏబీవీపీకి చెందిన విద్యార్థి సోషల్మీడియాలో చేసిన దూషణపై విచారణ జరుగుతుందనీ, త్వరలోనే చర్యలు తీసుకుంటామని హెచ్సీయూ వీసీ అప్పారావు తెలిపారు. టీచర్లకు ఎలాంటి నష్టం జరుగకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. శనివారం హెచ్సీయూలో తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ చక్రధర్రావు, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ బృందం వీసీ అప్పారావును కలిసింది. పోస్టింగ్చేసి రెండునెలల అయినా ఇప్పటికీ ఆ విద్యార్థిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదని, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు వీసీని కోరారు. లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదును ప్రొక్టోరల్బోర్డు రిఫర్ చేశామనీ, బోర్డు చైర్పర్సన్ విదేశాల్లో ఉండటంతో కొంత ఆలస్యమైందని వీసీ వారికి చెప్పారు. 22న హైదరాబాద్ వస్తున్నారనీ, దీంతో 24న ప్రొక్టోరల్బోర్డు సమావేశం నిర్వహిస్తున్నట్టు విద్యాపరిరక్షణ కమిటీ ప్రతినిధులతో తెలిపారు.