Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రమాణాలు, నిబంధనలే కాదు ఉత్తీర్ణత సరిగ్గా లేకపోయినా ఇంజినీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు రద్దు కానుంది. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలతో అనుబంధ గుర్తింపు నిబంధనలపై శనివారం సమావేశం నిర్వహించింది. ఉత్తీర్ణత లేకపోయినా, గత మూడేండ్లలో 25 శాతంలోపు ప్రవేశాలున్నా, అర్హులైన అధ్యాపకులు, నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు, ల్యాబ్లు, కంప్యూటర్లు లేకపోయినా అనుబంధ గుర్తింపు రద్దవుతుందని జేఎన్టీయూహెచ్ ఉపకులపతి వేణుగోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ ఎన్ యాదయ్య స్పష్టం చేశారు. ఈ అంశాలను పరిశీలించేందుకు కాలేజీల వారీగా తనిఖీలు చేపడతామని చెప్పారు. తనిఖీల ఆధారంగానే కాలేజీలపై ఓ నిర్ణయా నికి వస్తామని అన్నారు. ఆ తర్వాతే అనుబంధ గుర్తింపుపై నిర్ణయం తీసుకుం టామని చెప్పారు. జేఎన్టీయూహెచ్ నిబంధనలపై ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు అసహనం వ్యక్తం చేశాయి.