Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఔరంగాబాద్: మానవ సమాజ పరిణామ క్రమాన్ని వివరించిన చార్లిస్ డార్విన్ సిద్ధాంతం తప్పు అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సహాయ శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్లో శనివారం నిర్వహించిన 'ఆలిండియా వైదిక్ సమ్మేళన్' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సత్యపాల్ మాట్లాడుతూ... డార్విన్ ప్రతిపాదించినట్టుగా కోతి నుంచి మనిషి ఉద్భవించాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దీనిని ఎవరూ చూడలేదన్నారు. మన పూర్వీకులు సైతం ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారు. మానవులు భూమి మీదికి వచ్చినప్పటి నుంచి వారు మానవులుగానే ఉన్నారని, ఎలాంటి రూపాంతర ప్రక్రియ జరగలేదని పేర్కొన్నారు. ఆ సిద్దాంతం తప్పు అని, దానిని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలన్నారు.