Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్లో ఉన్న ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ ఆర్ట్స్ అభివ ద్ధి సంస్థ భవనంలో తమ వాటా అమ్మకానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీచేసింది. ఈ జీవో జారీపై తెలంగాణ రాష్ట్ర అధికారులు సమావేశమై ప్రభుత్వానికి సమాచారాన్ని అందించినట్టు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇది విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ సంస్థ అని, ఇంకా విభజన కాని, ఏపీ భూభాగంలో లేని భవనాన్ని ఎలా అమ్మకానికి పెడతారంటూ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపారు.