Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌలురైతులకు ఎకరాకు రూ.4వేలు ఇవ్వాలి:
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని బ్యాంకుల్లో మోసాలు పెరిగాయని, రుణ ఎగవేతదారులకు మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. సూర్యాపేటలోని ఎంవీఎన్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దల సాయంతోనే విజరు మాల్యా, నీరవ్మోడీ, విక్రమ్కోఠారీ రూ.కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి దర్జాగా దేశం దాటిపోతున్నారని అన్నారు. గిట్టుబాటు ధర లేక కంది రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కందికి రూ.8వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. పెట్టుబడి సాయం కింది కౌలు రైతులకు రూ.4వేలు వచ్చే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఏర్పడిందని, ప్రజలు, మేథావులు, రైతులు, విద్యావంతులు పెద్ద ఎత్తున బీఎల్ఎఫ్కు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు, మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.