Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ బెడ్ రూం కాలనీలకు ప్రత్యేక ప్రణాళిక
- వేసవిలో ప్రతీ గ్రామానికి భగీరథ నీళ్లు : సమీక్షలో ప్రశాంత్రెడ్డి, స్మితా సభర్వాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిషన్ భగీరథ ప్రధాన పనులు పూర్తయిన నేపథ్యంలో ఇక నుంచి గ్రామాల్లోని అంతర్గత పనుల మీద ద ృష్టిపెట్టాలని భగీరథ ప్రాజెక్టు వైస్ చైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బల్క్ సరఫరా మొదలైన తరువాత, ఇంట్రానెట్వర్క్ పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రధాన పనులు చేసిన వర్క్ ఏజెన్సీల సహకారం తీసుకుంటామని చెప్పారు. సచివాలయంలో వారు మిషన్ భగీరథపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
గ్రామాల్లోని కోసం ప్రత్యేకంగా ఈఈలు ఉన్న నేపథ్యంలో, పనుల్లో మరింత వేగం పెంచాలని చీఫ్ ఇంజినీర్లను సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా డిజైన్లను మార్చుకునేందుకు ప్రభుత్వం ఇదివరకే అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ఇక డబుల్ బెడ్ రూం కాలనీలు వచ్చే ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన ప్రణాళికను ముందే తయారుచేయాలన్నారు. ఇంట్రా పనులకు అవసరమైన మెటీరియల్ సరఫరాలో ఉన్న ఇబ్బందులను తొలగించామని, అవసరమైనంత తెప్పించుకోవాలన్నారు. ఇంట్రా పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి కావడానికి స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లతో పాటు కూలీలను సమీకరించుకోవడంలో చీఫ్ ఇంజినీర్లు మరింత క్రియాశీలంగా పనిచేయాలని సూచించారు. ఈసారి రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ తాగునీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ వేసవికి ప్రతీ గ్రామానికి భగీరథ నీళ్లు సరఫరా అవుతున్న కారణంగా, ఎండాకాలంలో తలెత్తే తాగునీటి కొరతను నివారించేందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం లేదన్నారు. ఇంట్రా పనుల కోసం కలెక్టర్లు పూర్తి సహకారం అందిస్తారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ బి.సురేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజినీర్లు కపాకర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, విజయపాల్రెడ్డి, విజరుప్రకాశ్, కన్సల్టెంట్లు నర్సింగరావు, శ్రీనివాస్రెడ్డి, జగన్, నందారావు, సురేష్ కుమార్, మనోహర్ బాబు, ఈఈ విజరు కుమార్ పాల్గొన్నారు.