Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
భూయజమానులకు తెలియకుండానే అధికారులు ఆ భూముల్లో డబుల్ బెడ్రూం నిర్మాణాల కోసం శిలాఫలకం వేసేశారు. కనీసం హైకోర్టు స్టేనూ పట్టిం చుకోలేదు. విషయం తెలియగానే బాధితులు భూముల దగ్గరకొచ్చి పురుగు మందుల డబ్బాలతో నిరసన తెలిపారు. ''ఈ భూమినే ఆడబిడ్డకు పసుపు కుంకు మ కింద ఇస్తామని చెప్పాం.. తెల్లవారితే పెండ్లి.. ఇప్పుడు చెప్పాపెట్టకుండా అధికారులు శిలాఫలకం ఎలా వేస్తారు.. తమ భూములను బలవంతంగా గుంజు కుంటే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాం'' అని బాధితులు హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పొట్లపల్లి పంచాయతీకి ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కెేటాయించింది. తొలుత రెవిన్యూ అధికారులు ఉల్వచెలక గ్రామాన్ని ఎంపిక చేసి భూసర్వే పూర్తి చేశారు. అక్కడ భూమి నిర్మాణా లకు అనుకూలంగా లేదనే కారణంతో పొట్లపల్లి రెవెన్యూ పరిధిలోని గడ్డిగూడెం గ్రామ పరిధిలో సర్వే నెం. 561/అ ఎంపిక చేశారు. అక్కడ అదే గ్రామానికి చెందిన ఎల్లు గోపయ్య ఆ ఎనిమిది ఎకరాల భూమిని 1962 నుంచి సాగు చేసు కుంటున్నారు. అనంతరం ఆయన కుమారులు ఎల్లు మల్లయ్య, అదయ్య, సీతారా ములు, రవిందర్ సాగులో ఉన్నారు. అదే భూమిని సీతారాములు కుమార్తెకు పసుపు కుంకుమల కింద ఇస్తామని ఒప్పుకున్నారు. ఆమె వివాహం బుధవారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వారి భూమిలో అధికారులు డబుల్ బెడ్రూం నిర్మాణాలకు సంబంధించి శిలాఫలకం నిర్మించారు. ఈ విషయం తెలియగానే బాధితులు మంగళవారం వారి భూమి వద్దకు పురుగుల మందు డబ్బాలు చేతపట్టుకుని వచ్చారు. తమ భూమిలో నిర్మాణాలు చేపడితే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కాగా మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేరని కార్యక్రమం వాయిదా వేశారు.
కోర్టు స్టే విధించింది : బాధిత రైతులు
తమకు వారసత్వంగా వస్తున్న భూమిని బలవంతంగా లాక్కోవాలని చూడ టం దారుణం. కనీసం అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా శిలాఫలకం వేశారు. తమ భూమికి సంబంధించిన హక్కు కోసం కోర్టును ఆశ్రయించాం. ఇప్పటికే కోర్టు స్టే విధించింది. అయినా ఆ భూమిలో అధికారులు ఎలా శిలాఫలకం ఏర్పాటు చేస్తారు?