Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజుల్లో మూడు నివేదికలు.. మూడింట్లో బాలలే బాధితులు!
- ఆరోగ్యం, మేని ఛాయ కలిగిన అనాథ పిల్లల్నే దత్తత తీసుకుంటున్న ఇండియన్స్..
- రుగ్మతలతో బాధపడుతోన్న అనాథ చిన్నారులను చేరదీస్తోన్న ఎన్ఆర్ఐ/విదేశీయులు: సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ
- ఫ్యామిలీ మెంబర్స్ ను చూసి పొగ తాగడాన్ని నేర్చుకుంటున్న 6.25లక్షల మంది చిన్నారులు: అమెరికన్ క్యాన్సర్ సొసైటీ
* కడవేర్గు
''పాప చురుగ్గా ఉన్నప్పటికీ, కొంచం రక్తహీనతతో బాధ పడుతున్నట్టు అనిపిస్తోంది. ఇంకొకరిని చూపించండి'' దత్తత తీసుకోవడానికి వచ్చిన ఓ ఇండియన్ దంపతుల మాట!
''మా అన్నయ్య సిగరెట్ స్టైల్ గా కాలుస్తాడు. నేనెందుకు ట్రై చెయ్యకూడదు?''
- ఆరో తరగతి అబ్బాయి ప్రశ్న.
గత వారం రోజుల్లో వెలువడిన మూడు అధ్యయనాలు.. చిన్నారుల ఆలోచనలు, పిల్లలపై పెద్దల, ప్రభుత్వాల వైఖరి తదితరాలను విభిన్న పార్శ్వాల్లో ఆవిష్కరించడం విశేషం.
లోపం ఉంటే మాకొద్దు:
అమ్మా నాన్నల ప్రేమకు, అయినవాళ్ళ అనురాగానికి నోచుకోలేని పసిపిల్లలు ఎందరో అనాథ శరణాలయాల్లో, చైల్డ్ కేర్ సెంటర్లలో స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత కోసం పరితపిస్తుండటం తెలిసిందే! మాత త్వపు పరిమళాలను ఆస్వాదిస్తూ.. తల్లిదండ్రులు లేని ఆ పసి హృదయాలను దత్తత తీసుకొని.. మాత మూర్తులుగా మారాలనుకొనే పిల్లలు లేని దంపతుల తపనను కూడా మెచ్చుకోవాల్సిందే! ఐతే, సదరు దత్తత ప్రక్రియలో కూడా పసివారిపై మన దేశీయులు వివక్షను చూపుతున్నట్టు తేలడం విస్తుగొలుపుతోంది. కాళ్లు, చేతులు, ముక్కు, నోరు, రంగు, ఆరోగ్యం, వయస్సు ఇలా ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మన భారతీయులు పిల్లల్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని, ఇదే విషయంలో ఎన్ఆర్ఐ/విదేశీయులకు అంతగా పట్టింపు ఉండట్లేదని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) తాజా గణాంకాలు తెలిపాయి. 2017-18 లో సుమారు 552 మంది చిన్నారులను ఎన్ఆర్ఐ/విదేశీయులు దత్తత తీసుకోగా.. ఇందులో సుమారు 60శాతం మంది పసివారు శారీరకంగా లేదా మానసికంగా ఎంతో కొంత బాధతో ఉన్నవారేనని, సుమారు 90శాతం చిన్నారుల వయస్సు ఆరు సంవత్సరాల పైబడే ఉన్నట్టు తేలింది. అయితే, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులను దత్తత తీసుకునే ఎన్ఆర్ఐ/విదేశీయులు గత సంవత్సరంతో పోలిస్తే, ఈ యేడాది పది శాతం పెరగ్గా, స్వదేశీయుల సంఖ్య మరింత తగ్గడం గమనార్హం. కాగా, మన పిల్లల్ని దత్తత తీసుకునే దేశాల్లో అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి.
వాళ్ళను చూసే :
తెలిసీ తెలియని పసి మనసు.. ఇతరులు ఏం చేస్తే, అదే అనుసరించే మనస్తత్వం... వెరసి, పొగరాయుళ్ళ ఆకర్షణకులోనై ( ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ మూలంగా ) తమ జీవితాలను కోల్పోతున్న బాలభారతంను చూసి పలువురు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. దేశంలో పది నుంచి 14ఏండ్ల వయసు కలిగిన సుమారు 6.25లక్షల మంది చిన్నారులు (4.29లక్షల మంది అబ్బాయిలు, 1.95లక్షల మంది అమ్మాయిలు ) రోజూ పొగతాగుతున్నట్టు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ(ఏసీఎస్), వైటల్ స్ట్రాటజీస్ సంస్థలు గ్లోబల్ టుబాకో అట్లాస్ డేటా పేరుతో సంయుక్తంగా చేసిన తాజా అధ్యయనంలో తేలడం విస్తుగొలుపుతోంది. కాగా, భారత్లో పొగాకు మూలంగా సంభవించే క్యాన్సర్లు, గుండెపోటు సంబంధిత వ్యాధుల వల్ల ఏటా 9.32లక్షల మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
ఎంత శాతం పెరిగారో తెలుసా?:
పేదరికం, సామాజిక, కుటుంబ ఆర్థిక పరిస్థితులను ఆసరా చేసుకొని కొన్ని ముఠాలు పిల్లల్ని బలవంతంగా అపహరించి మహానగరాల్లో భిక్షాటనకు వినియోగిస్తుండటం.. ఇంకొన్ని సందర్భాల్లో బాలికలను పడుపు వ త్తిలోకి దింపుతుండటం తెలిసిందే! ఇలాంటి ఘటనలు దేశంలో ప్రతీ ఏటా క్రమంగా పెరుగుతున్నాయని తెలిసినా.. మన ప్రభుత్వాల్లో చలనం మాత్రం రావడం లేదు. గత దశాబ్ద కాలంలో మన దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు/ అపహరణ కేసులు ఏకంగా 500శాతం పెరగడం(2016 లో నమోదైన కేసులు1,06,958 కాగా, 2006 లో నమోదైన కేసుల సంఖ్య 18,967) ఆందోళనను కలిగిస్తోంది. గత పదేండ్లలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన నివేదికలను పరిశీలిస్తే, ఈ విషయం అర్ధమైందని.. ఇప్పటికైనా, పిల్లలను అపహరించే ముఠాలపై ప్రభుత్వాలు గట్టి నిఘాను పెట్టే అవసరమున్నదని 'క్రై చైల్డ్ రైట్స్ అండ్ యూ' స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు.