Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైలుపై సీఎం సంతకం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని పరకాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఆయన శుక్రవారం సంతకం చేశారు. పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర, నడికుడ మండలాలతో ఈ డివిజన్ను ఏర్పాటు చేయనున్నారు.