Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంఠేశ్వర్
వాహనాలను ఆపి దారిదోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ముగ్గు రిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారీలో ఉన్న ట్టు నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ వెల్లడిం చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు తెలిపారు. ఆరుగురు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా దారిదోపిడీలు చేస్తున్నారు. డిచ్పల్లి నుంచి జక్రాన్పల్లికి వెళ్లే దారిలో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వాహనాలను ఆపి బెదిరించి దోచుకుంటున్నారు. ఈనెల 20న మహమ్మద్ నజీర్ ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. డిచ్పల్లి సీఐ రామాంజనేయులు, ఎస్ఐ సురేష్ కుమార్, పోలీసు సిబ్బం ది ఈనెల 22న పక్కా సమాచారం మేరకు పుప్పాలపల్లె ఎక్స్రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపుగా వెళ్తున్న ఇన్నోవాను ఆపి పత్రాలను పరిశీలించారు. అవి లేకపోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిజామాబాద్లోని మిఠాయిపుర బోధన్ రోడ్డుకు చెందిన మహమ్మద్ అబ్దుల్ అహద్ సైఫ్, హైమత్పుర కాలనీకి చెందిన షేక్ సోహెల్, ఖిల్లా చౌరస్తాకి చెందిన ఇమ్రాన్ ఖాన్తో పాటు మరో ముగ్గురు గ్రూపుగా ఏర్పడి దారిదోపిడీలు చేస్తున్నట్టు వారు అంగీకరించారు. ఫిబ్రవరి, మార్చిలో ఆరు దారిదోపిడీలు చేసినట్టు ఒప్పుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, 48 గంటల్లో వారినీ అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. కేసును ఛేదించిన డిచ్పల్లి సీఐ రామాంజనేయులు, ఎస్ఐ సురేష్కుమార్, కానిస్టేబుళ్లు కిరణ్గౌడ్, మురళీ, రాజేశ్వర్ను సీపీ అభినందించారు.