Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనమండలిలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలో నీరవ్మోడీ సంస్థకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీరామారావు అన్నారు. ప్రస్తుతం ఆ ఆస్తులు ఐటీ అండ్ ఈడీ సంస్థలకు అటాచ్ అయినట్టు చెప్పారు. రాష్ట్రంలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు కర్నె ప్రభాకర్, ఎంఎస్ ప్రభాకర్రావు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. 2005-06 తర్వాత రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక పార్కులు రాలేదని గుర్తుచేశారు. దేశంలో అతిపెద్ద జౌళిపార్కును ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 40వేల ఎకరాల్లో 53 ఇండిస్టీయల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటిలో ఇప్పటికే 26 పార్కులకు భూములు కూడా ఇచ్చినట్టు తెలిపారు. గత ప్రభుత్వాలు పలు సంస్థలకు కేటాయించిన 1,035 ఎకరాలను వెనక్కి తీసుకుంటామన్నారు. డ్రైపోర్టు ఏర్పాటుపై దుబారుపోర్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. డ్రైపోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాలన్నారు. హుస్సేన్సాగర్, సరూర్నగర్ చెరువుల వద్ద వివిధ ఏజెన్సీ ప్రకటనలను ప్రదర్శించడానికి బిల్బోర్డులను ఏర్పాటు చేయలేదని మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
కమిషన్ నివేదిక తర్వాతే ఎంబీసీ జాబిత: జోగురామన్న
రాష్ట్రంలోని సంచార జాతులు ఎంబీసీ కులాల కిందికే వస్తాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. బీసీ కమిషన్ నివేదిక తర్వాత ఎంబీసీ జాబిత ప్రకటిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్ రా మచంద్రారావు...మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా అడిగిన ప్రశ్నకు ఆ యన సమాధానమిచ్చారు. సంచార జాతుల కోసం ప్రత్యేక సమాఖ్య ఏర్పాటు చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో లేదని చెప్పారు. ఓబీసీ జా బితాలోని కులాలను గుర్తించి, వివరాలు కేంద్రానికి పంపించామన్నారు.
ఆకస్మిక గుండెపోటుతోనే డ్రైవర్లు మృతి: మహేందర్రెడ్డి
ఆర్టీసీ బస్సులు నడిపేటప్పుడు గుండెపోటు కారణంగా డ్రైవర్లు తరచుగా మరణించడం లేదనీ, గతంలో మూడుసార్లు మాత్రమే ఆ ఘటనలు జరిగాయని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. మండలిలో సభ్యులు జనార్థన్రెడ్డి, పూల రవీందర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. జరిగిన మూడు కేసుల్లోనూ విచారణ జరిపించామనీ, వారిలో ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధులు లేవని తేలిందని అన్నారు. ఆకస్మిక గుండెపోటుతోనే మరణించి ఉంటారని చెప్పారు. డ్రైవర్లకు రెగ్యులర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
విద్యుత్ టారిఫ్ స్లాబులు మార్చే ఆలోచన లేదు: జగదీశ్రెడ్డి
రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ స్లాబులు, రేట్లను సవరించే విషయం ప్రభుత్వ పరిశీలనలో లేదని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. 2018-19 సంవత్సరానికి టారిఫ్ మార్చడం కోసం డిస్కమ్లు ఎలాంటి ప్రతిపాదనలను విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు సమర్పించలేదని చెప్పారు. ఎమ్మెల్సీ అమీనుల్ హసన్జాఫ్రీ అడిగిన ప్రశ్నను మంత్రి సమాధానమిచ్చారు. డిస్కమ్ల రూ.8923కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టు చెప్పారు.
గ్రంథాలయాలకు పూర్వవైభవం తెస్తాం: కడియం
గ్రంథాలయాలు సామాజిక చైతన్యం పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోశిస్తాయనీ, తెలంగాణ రాష్ట్రంలోని గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా 31 జిల్లాల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీటిలో 537 బ్రాంచు గ్రంథాలయాలు, 831 పుస్తక డిపాజిట్ కేంద్రాలు పనిచేస్తున్నాయని అన్నారు. సిద్దిపేట జిల్లాలో పది బ్రాంచు గ్రంథాలయాలున్నాయన్నారు. మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి, కర్నె ప్రభాకర్, నారదాసు లక్ష్మణ్రావు, భానుప్రకాశ్, పూల రవీందర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.