Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయితీరాజ్, మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి : అసెంబ్లీలో సున్నం రాజయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జడ్పీటీసీ, ఎంపీటీసీలకు అధికారాలు కల్పించాలని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. నిధులు విధులు లేక ప్రస్తుతం వారు ఉత్సవ విగ్రహాలుగా మారారని చెప్పారు. సమావేశాల్లో కూర్చోవడానికి వారికి ఒక కుర్చీ కేటాయించడం తప్ప ఇతర అధికారాలను ప్రభుత్వం కల్పించలేదని విమర్శించారు. శుక్రవారం మున్సిపల్, పంచాయితీరాజ్, ఇరిగేషన్ పద్దలపై జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయితీలకు 29 అధికారాలు కల్పించినప్పటికీ ఏ ఒక్క అధికారం కల్పించడం లేదన్నారు. గ్రామపంచాయితీల్లో పని చేస్తున్న 20వేల మందికి కార్మికులకు జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శిథిలావస్థలో ఉన్న పంచాయితీ భవనాలకు నూతన భవనాలను నిర్మించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పంచాయితీ భవనాల నిర్మాణాలకు ఫారెస్టు అధికా రులు అనుమతులివ్వడం లేదనీ, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం కల్పించుకుని అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నగరంలో చినుకు పడితే చిత్తడే
దేశంలోనే అతి పెద్ద నగరమైన రాష్ట్ర రాజధా నిలో చినుకు పడితే రోడ్డన్నీ చిత్తడి అవుతున్నాయి.. వర్షా కాలంలో కాలి నడకకు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్లోని మెరుగుపర్చాలని సూచించారు.
గ్రామజ్యోతికి నిధులేవి?
గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామజ్యోతికి నిధులు సమకూ ర్చాలన్నారు. గ్రామజ్యోతి అంటే ఏమిటో నిర్వచనం చెప్పాలన్నారు.
కొత్త బస్సులను కొనుగోలు చేయాలి
ఆర్టీసీలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భద్రాచలం నుంచి హైదరాబాద్కు తాను ప్రయాణిస్తున్న బస్సే మూడు సార్లు చెడిపోయిందని చమత్కరించారు. కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికుల ఇబ్బం దులను తొలగించాలన్నారు.
వేగవంతంగా ప్రాజెక్టులను పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని సున్నం రాజయ్య సూచించారు. నీటి పారుదల రంగంపై ఆ శాఖ అధికారులు జవాబుదారి తనంగా ఉండాలని తెలిపారు. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన ట్రిపుల్ ఆర్ఆర్ఆర్ పనులకు టెండర్లను పిలవాలని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు.
సారా నిల్వ ఉంచుకునేందుకు అనుమతించాలి
తాండాల్లోని గిరిజనులు ఇప్ప పూవుతో చేసిన సారాను నిల్వ ఉంచుకునేందుకు అభ్కారీ శాఖ అనుమతించాలని కోరారు. పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో గిరిజనులు సారాను ఉపయోగించే ఆనవాయితీ ఉందన్నారు.