Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన వర్థంతి సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
షహీద్ భగత్సింగ్ పోరాటస్ఫూర్తితో బీఎల్ ఎఫ్ ముందుకు పోతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ ఎఫ్) ఆధ్వర్యంలో భగత్సింగ్ 87వ వర్థంతిసభను ఆ ఫ్రంట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ...సమస్యల పరిష్కా రానికి సోషలిజమే ఏకైక మార్గమని చెప్పిన వ్యక్తి భగత్సింగ్ అని అన్నారు. ఆయన హిందుత్వవాదీ, జాతీయవాది అంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. భగత్సింగ్ అడుగుజాడల్లో బీఎల్ఎఫ్ నడుస్తుందని తెలిపారు. బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... భగత్సింగ్ చూపిన దారిలో బహుజన రాజ్యస్థా పనకు కృషి చేద్దామని అన్నారు. ఆయన మరణం చివరి గడియల్లోనూ లెనిన్రాసిన 'రాజ్యం-విప్లవం' చదివారని గుర్తుచేశారు. ప్రస్తుత మున్న అననుకూల పరిస్థితుల్లోనూ భగత్సింగ్ స్ఫూర్తితో అనుకున్న లక్ష్యసాధ నకు ముందుకు పోదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోటరమేశ్, బీఎల్ ఎఫ్ నాయకులు గుజ్జ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బీఎల్ ఎఫ్ నాయకులు, కార్యకర్తలు భగత్సింగ్ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.