Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
టీఆర్ఎస్ సర్కారు గత నాలుగేండ్ల కాలంలో అమలు చేసిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసు కుం టుంటే నీరో చక్రవర్తిలాగా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంటూ అంటూ బెంగాల్, బెంగళూరు తిరు గుతున్నారని ధ్వజమెత్తారు. నేటి నుంచి రాష్ట్రంలో జరగనున్న టీఆ ర్ఎస్ ప్లీనరీలో ఈ అంశాలను కార్యకర్తలు ప్రశ్నించాలని సూచిం చారు. గురువారం ఢిల్లీలోని తెలం గాణభవన్లో పొన్నం మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ సభ పేరును ప్రగతి ప్రాంగణం కాకుండా కల్వ కుంట ప్రగతి ప్రాంగణంగా పెట్టు కోవాలని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజె క్టులకు హెడ్ రెగ్యులేటరీలు కట్టి తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్ పే రుతో లక్షల కోట్లు ప్రజాధనం వృథా చేస్తున్నా కేసీఆర్ను గవర్నర్ పొగు డుతున్నారని అన్నారు. గవర్నర్ తన పేరును కల్వకుంట్ల నరసింహన్గా మార్చుకోవాలని చెప్పారు.