Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ వేటగాళ్ల మూలంగా ఆదివాసీలు బలి
- మనుషులపై ప్రయోగాలు, లైంగిక దాడులకు తెగబడుతోన్న దుండగులు
- అండమాన్లో అంతరించే దశకొచ్చిన జరావాతెగ
- దేశంలోని 19 రాష్ట్రాల్లో నిలువు దోపిడీ.. పలు జాతులు, తెగల అస్థిత్వం ప్రశ్నార్థకం
- నాయకుల వాగ్దానాలు, అంతర్జాతీయ తీర్మానాలు.. అన్నీ నీటి మూటలేనా?!
నీలాంబర వీధి నుంచి నేలవాలిన దేవతలు కారు. ఐతేనేమీ, ప్రపంచాన్ని గడగడలాడించిన 2004 సునామీ ప్రళయాన్ని ముందుగానే పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు చేరుకొని, ప్రాణాలతో బయటపడ్డారు వాళ్ళు. ఆధునిక సాంకేతికత సైతం నిక్కచ్చిగా అంచనా వేయలేని ఉత్పాతాలను కూడా పంచభూత గమనాల్లోని హెచ్చుతగ్గుల సాయంతో పసిగడుతూ.. ప్రాణాలను కాపాడుకుంటున్న ఆ తెగలవారు.. నేటి నవీన మానవుడు వేస్తోన్న పాచికలకు ప్రాణాలు వదులుతున్నారు. ఆ నేపథ్యంపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
* జై
ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 దేశాలలోని దాదాపు 37కోట్ల ఆదివాసీల జనాభా ప్రస్తుతం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అందుకు భారతావని మినహాయింపు కాదు.
వాళ్ళు కాదు.. మనమే వాళ్ళ పాలిట..:ఓ వైపు పచ్చగా పరుచుకొన్న అడవి అం దాలు, మరోవైపు నీలిసాగర అలల సోయగాలు.. అందాలను కనులకు విందుచేసే అండమాన్ ఉత్తర ద్వారపు ద్వీపంలో పొరపాటున అడుగు పెట్టారో.. ప్రాణాలు పోవడం ఖాయమని, బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా నివసించే గిరిజనులు.. సదరు దీవి వెంబడి ప్రయాణించే వారిని అకారణంగా చంపుతారని.. గతంలో, ఎంతోమంది నావికులు ఈ దీవి సమీపంలో ప్రయాణించగా హత్య చేయబడ్డారన్న పుకార్లు తెలిసినవే! ఐతే, దాడులు, అఘాయిత్యాలు ఎవరు ఎవరిపై జరుపుతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశం. దట్టమైన ఆ కీకారణ్యాలతో కప్పి ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో నివా సముంటున్న సెంటినెలస్, జరావా, ఓంజే మొద లైన తెగల వాళ్ళపై జరుగుతోన్న అఘాయి త్యాలు, దాడులు ఇప్పుడు ప్రస్తావనార్హం. ముఖ్యంగా, అతికొద్ది మందిగా ( సుమారు 250 పౌరులు) మిగిలిపోయిన జరావా తెగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు 50 వేల సంవత్సరాలుగా అండమాన్ ప్రాంతంలో వేటతో ఆహారాన్ని సేకరించుకుంటూ మనుగడ సాగిస్తు న్న జరావాలపై టూరిస్టుల ముసుగులో అక్కడి ప్రాంతానికి వెళ్తున్న మానవ వేటగాళ్ల మూలంగా ఇప్పటికే పలువురు జరావా యువతులు లైంగిక దాడులకు గురయ్యారని, మత్తుమందులిచ్చి సదరు జాతిపై పలు ఔషద ప్రయోగాలు సైతం జరిగాయన్న విమర్శలున్నాయి. పైచర్యలను అరికట్టి, జరావా గిరిజన తెగ మనుగడ ప్రమా దంలో పడకుండా కాపాడటంలో మన దేశ పాలకులు విఫలమయ్యారని అంతర్జాతీయ ఆది వాసీ హక్కుల ఉద్యమ సంస్థ సర్వైవల్ ఇంటర్నేషనల్ సైతం తూర్పారబట్టడం విదితమే! 2015 మార్చి నెల కంటే ముందే 'మానవ వేట గాళ్లు' ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా కట్టడి చేస్తామన్న సుప్రీం మాటలు కూడా నీటి మూట లుగా మారడం విచారకరం. జరావాల వలే ప్రపంచవ్యాప్తంగా 5000లకు పైగా ఉన్న పలు తెగల్లోని వందలాది సమూహాలపై అక్రమార్కు లు, దుండగుల దాడులు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నట్టు పలు ఆదివాసీ సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, బయటి ప్రపంచానికి పరిచయం లేని తెగలు వందకుపైనే ఉన్నట్టు సర్వైవల్ ఇంటర్నేషనల్ అధ్యయనంలో తేలడం విశేషం.
చర్యలు శూన్యం: ఆదివాసీలు, గిరిజనులు.. సామాజికంగా, సాంస్క తికంగా ఏ దేశానికైనా ఆదివాసీలన్నది అంగీకరిం చాల్సిన విషయం. ప్రస్తుత భారత జనాభాలో దాదాపు 8-9 శాతం ప్రజలు పలు గిరిజన సమూహాలకు చెందిన వారై, వివిధ ప్రాంతాల్లో జీవనాన్ని సాగిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో బైగా తెగలు, రాజస్థాన్, తమిళ నాడులో 'కోట' తెగ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చెంచులు, తోటి, పరెంగి పోర్జ ఇలా19 రాష్ట్రాల్లో విస్తరించి వున్న ఈ తెగలు తమ అటవీ భూము లపై హక్కులను కోల్పోయి, వివిధ దాడుల నేప థ్యంలో అస్తిత్వపు అంచుల్లో కొట్టుమిట్టాడుతూ.. ఆయా ప్రభుత్వాల శీతకన్ను మూలంగా కాలక్ర మేణా కరిగిపోతున్నాయన్నది వాస్తవం. అరేబి యా సముద్రం(43), బంగాళాఖాతాల్లో (204) ఉన్న సుమారు 247 పెద్ద దీవులపై భారతదేశం సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంది. ఈ దీవుల్లోని అతి ప్రాచీన ఆదిమ మానవ తెగలు వేల యేండ్ల మునపటి నుండే జీవనాన్ని సాగిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేట్ అండమానీస్, జరావా, ఒంగే, సెంతినిలిలు, శోంపెన్ తెగలకు చెందిన మూల వాసీల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మార డం విస్మయాన్ని కలిగిస్తోంది. ఆదివాసీల అస్తిత్వం నాశనమవుతున్నదన్న తలంపుతో 60వ దశకంలోనే అప్పటి ప్రభుత్వాలు ఎన్నో చర్యలు, రాజ్యాంగ రక్షణలు, విధివిధానాలు రూపొందించి నప్పటికీ.. ప్రభుత్వ తప్పిదాలు, లోప భూయిష్ట విధానాల వల్ల ఆయా ప్రతిపాదనలు కార్యరూ పం దాల్చలేదు. అంతే నా ఐఎల్ఒ కన్వెన్షన్ డిక్లరే షన్ ఆన్ ది రైట్స్ అఫ్ ఇండిజీనాస్ పీపుల్, జోహా న్స్ బర్గ్ ప్లాన్, కిన్బర్లి సమ్మిట్ 2002, మనిలా డిక్లరేషన్ 2000 ఇలా ఎన్నెన్నో అంతర్జాతీయ తీర్మానాలు చేసినప్పటికీ.. పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించట్లేదు. కొందరి స్వలాభం మూలంగా.. అడవి బిడ్డలు తమ పరిధులలో సైతం ఆత్మగౌరవంతో కూడిన స్వేచ్ఛా జీవనాన్ని సాగించలేని దుర్భరస్థితి దాపురించడం నిజంగా దయనీయం. నాగరిక సమాజానికి ఆధ్యులుగా పిలిచే మూలవాసీల రోదనను పట్టించుకోని ఈ ఆధునిక సమాజం, ప్రభుత్వాలు ఎంత అభివృద్ధి చెందినా ఏం లాభం??
తెలియని నిజాలెన్నో..
- అండమాన్ దీవుల్లో సంచార జీవనం చేసే మొకెన్ జాతికి చెందిన 'సీ జిప్సీ' జాతి పిల్లల కంటి చూపు యూరోపియన్ చిన్నారుల కంటే 50 శాతం ఎక్కువట! ఆహారం కోసం సముద్రంలో డైవ్ చెయ్యడం వీరి ప్రత్యేకత!
- ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో వున్న దాదాపు 6700 భాషల్లో 4000 భాషలు ఆదివాసీల నుంచే వచ్చినవి. కాగా, భూప్రపంచంలో మాట్లాడే ప్రతి ఆరు భాషల్లో ఒకటి న్యూగునియా నుంచే వచ్చిందట! ప్రస్తుతం ఆధిపత్య భాషల ద్వారా ఇవి కనుమరుగవుతున్నాయనేది ఒక నివేదిక. జరావాయేతర పురుషుడితో సంపర్కం ద్వారా సదరు తెగ మహిళ ఒక పాపను ప్రసవించగా.. తర్వాత, ఆ పాప హత్యకు గురైంది. వివిధ వ్యాధుల మూలంగా జరావా తెగ అంతరించిపోకుండా కాపాడాలన్న ఉద్దేశంతోనే మనసు చంపుకొని వాళ్ళు ఈ పని చేశారని పలువురు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆ తెగ యువతిలపైనే 'మానవ వేటగాళ్లు' అకృత్యాలకు తెగబడి తెగల వారిని రోగాలబారిన పడేలా చేస్తుండటం విచారకరం.