Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడు సిహెచ్ రాములు, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బదిలీలు, పదోన్నతుల కోసం మూడేండ్లుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ కేసుతో నిమిత్తం లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని సూచించారు. సమయం సరిపోకపోతే ప్రక్రియను కొనసాగించి, ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త పోస్టుల్లో చేరే విధంగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని కోరారు. సాధారణ బదిలీలతోపాటు అంతర్జిల్లా, అంతర్రాష్ట్ర బదిలీలూ నిర్వహించాలని డిమాండ్ చేశారు.