Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
విద్యుద్ఘాతానికి గురై తల్లీ, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఆదివారం జరిగింది. చింతలచెర్వు లక్ష్మి (50), గోపి (20) హుజూర్నగర్రోడ్డులో ఉపాధి హామీ ద్వారా నిర్వహించే నర్సరీలో పనిచేస్తున్నారు. ప్రమాదవశాత్తు గోపికి విద్యుత్వైరు తగలడంతో కేకలు వేస్తుండగా, పక్కనే ఉన్న తల్లికాపాడాలనే ప్రయత్నంతో కుమారుడిని పట్టుకున్నది. దీంతో ఆమెకు కూడా కరెంట్షాక్ కొట్టింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ నరేష్ ఘటనాస్థలిని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.