Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకురాలు జ్యోతి
నవతెలంగాణ-జగిత్యాలటౌన్
బహుజనులకు రాజ్యాధికారం రావాలని, అందుకు ప్రజలు బీఎల్ఎఫ్ను ఆదరించాలని రాష్ట్ర నాయకురాలు జ్యోతి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీమాస్ కార్యాలయంలో నక్క విజరు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన బీఎల్ఎఫ్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో రాజ్యాధికారం అగ్రకులాల చేతుల్లో ఉందన్నారు. రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అట్టడుగువర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. 70 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఇంత వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల ప్రకారం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సీట్లు కేటాయించలేదన్నారు. ఈ అన్యాయానికి తెరదించుతూ బీఎల్ఎఫ్ ప్రజల ముందుకు వచ్చిందన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల్లో ఓటు చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు 65 సీట్లు కేటాయిస్తుందని, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలలోనూ పోటీ చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ తిరుపతి నాయక్, టీమాస్ ఛైర్మన్ నక్క విజరు, టీమాస్ నాయకులు సంపత్, రాజ్నాయక్, అధిక్, మహేందర్, గంగారాం, రవీందర్, మల్లేశ్, రాజన్న, లకëణ్, సాజీద్, అశోక్, శోభన్, రమేష్, వినోద్ పాల్గొన్నారు.