Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ వ్యాఖ్యలపై తమ్మినేని ప్రశ్న
నవతెలంగాణ-కోదాడరూరల్
కేంద్రం బయ్యారం ఉక్కు ప్రాజెక్టు నిర్మాణం చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మంత్రి కేటీఆర్ చెబుతున్నారనీ, అక్కడ పరిశ్రమను నిర్మించబోమని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారా? లేదా విమర్శిస్తున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీని పల్లెత్తి మాట కూడా అనలేని వీరు తెలంగాణ ప్రజలను ఏవి ధంగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. బయ్యారం పరిశ్రమ నిర్మిస్తే లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందనీ, చట్టబద్ధంగా రూపొందిన బయ్యారం ప్రాజెక్టును ఇలా నిర్లక్ష్యం చేయడం దారుణమనీ అన్నారు. వందలెకరాలున్న భూస్వాములకు రైతుబంధు కింద ఎకరాకు రూ.8 వేలు ఇవ్వడం సరిగాదన్నారు. నిబంధనలు పెట్టి ఇస్తే బాగుంటుందని సూచించారు. రైతుబంధు వల్ల కౌలు, సన్నకారు రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. రేషన్ డీలర్ల సమ్మె, హమాలీల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపు తున్నామన్నారు. బీఎల్ఎఫ్ గ్రామగ్రామాన ఇంటింటి సర్వే నిర్వహి స్తున్నదని, ఈ సర్వేలో ప్రజల నుంచి వచ్చిన వినతులతో ఈనెల 27న కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ధర్నాల్లో ప్రజ లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. పంచాయతీ ఎన్ని కలు తక్షణమే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించారు. ఈ సమా వేశంలో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, సాయిబాబు, జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు, పట్టణ కార్యదర్శి ముత్యాలు, కుక్కడపు ప్రసాద్ ఉన్నారు.