Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు పాలిసెట్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను జరపాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం సాంకే తిక విద్యాశాఖ కమిషనరేట్ కార్యాల యాన్ని ముట్టడించి ఆందోళన నిర్వ హించింది. కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థి సంఘాల నేతలు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని నినాదాలు చేశారు. అనం తరం సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ యూవిఎస్ఎన్ మూర్తిని శుక్రవారం హైదరాబాద్లో జగన్ (డీఎస్ఎఫ్), జనార్ధన్ (డీఎస్యూ), ఎం పరశురాం (పీడీఎస్యూ), సమీర్ (టీవీఎస్), కోట రమేష్ (ఎస్ఎఫ్ఐ), శివకుమార్ (ఎస్ఎస్ ఎఫ్), మద్దిలేటి (టీవీవీ), ఆర్ ప్రవీణ్ (జేఎన్టీయూ జేఏసీ) కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు అనుమతి ఇచ్చి, ప్రభుత్వ కాలేజీలకు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు.