Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవో సరి చేయాలి : ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్యే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396లో అనేక లోపాలు ఉన్నాయని, దాన్ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అశోక్కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతర ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న 34 శాతం రిజర్వేషన్లను ఏమాత్రం తగ్గించకుండా యధావిధిగా అమలు చేయాలని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు జనాభా నిష్పత్తిలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 56శాతానికి పెంచాల న్నారు. పంచాయతీరాజ్ ఎన్నికలలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం గ్రామ పంచా యతీలను ఒక యూనిట్గా తీసుకుని 34శాతం రిజర్వేషన్లు అమలు చేయాల న్నారు. రాష్ట్రంలో 12,751 గ్రామపంచా యతీలు ఉండగా అందులో 34 శాతం రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 4,335 సర్పంచ్ స్థానాలు వస్తాయని, కానీ 3,400 స్థానాలు మాత్రమే వస్తా యని అధికారులు తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.