Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్సీ కమిటీకి పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల కనీస వేతనం రూ.40,690 నిర్ణయించాలని పీఆర్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పీఆర్సీ కమిటీ చైర్మెన్ సిఆర్ బిశ్వాల్, సభ్యుడు రఫత్అలీలను శుక్రవారం సచివాలయంలో పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు పి సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చి చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీలు కె జనార్ధన్రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి మోహన్రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైన 2018, జూన్ 2 నుంచి నూతన వేతనాలు అమల్లోకి తేవాలని కోరారు. 2018, జూన్ 2 నాటికి ఉన్న మూలవేతనంతో కలుపుకొని వేతనాలను 1.92 రెట్లు లేదా 65 శాతంతో స్థిరీకరించాలని సూచించారు. గతంలో మాదిరిగా మాస్టర్ స్కేలు విధానమును కొనసాగించాలని తెలిపారు. గతంలో ఉన్న 80 స్టేజీలు, 32 సెగ్మెంట్లతో మాస్టర్ స్కేల్ ఉండాలని సూచించారు. 3 శాతం పెంపుతో వార్షిక ఇంక్రిమెంట్లు ఉండాలని తెలిపారు. కనిష్ట, గరిష్ట వేతనాలు నిష్పత్తి 1:9:85గా ఉండాలని పేర్కొన్నారు. సెకండరీ గ్రేడు తత్సమాన టీచర్లకు రూ.40,690-రూ.1,27,510, స్కూల్ అసిస్టెంట్కు రూ.55,570-రూ.1,65,220, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు రూ.67,820-రూ.1,85,440 వేతనాలు ప్రతిపా దించాలని కోరారు. డిప్యూటీ ఈవోలకు రూ.78,220-రూ.2,01,970, డీఈవోలకు రూ.90,250-రూ.2,13,550 ఉండాలని సూచించారు. సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పించన్ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు.