Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్నేహం ముసుగులో సెల్ఫీలు.. బ్లాక్మెయిలింగ్
- ఆ దృశ్యాలు వాట్సాప్లో
- బాలిక తండ్రి ప్రశ్నించటంతో విషయం వెలుగులోకి
- పోక్సో చట్టం కింద కేసు...రిమాండ్కు యువకుడు
- నిజామాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి
నవతెలంగాణ-కంఠేశ్వర్
అమ్మాయి పదోతరగతి. అబ్బాయి ఇంటర్. పక్కపక్క ఇండ్లలో ఉంటుండటంతో వారిద్దరూ స్నేహితులయ్యారు. స్నేహం ముసుగులో ఆ యువకుడు బాలికపై కన్నేశాడు. పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్ కట్ చేద్దామని తీసుకెళ్లాడు. ఆ సందర్భంలో దిగిన సెల్ఫీలను అసభ్యంగా మార్చి బ్లాక్మెయిల్ చేసి బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వాటినీ వాట్సాప్లో పెట్టి వేధించసాగాడు. బాలిక తీవ్ర ఆందోళన చెందుతుండటాన్ని చూసి
తండ్రి ప్రశ్నించగా విషయాన్ని చెప్పింది. యువకుని సెల్ఫోన్లో తన కుమార్తె అసభ్య వీడియోలు, ఫొటోలు చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు యువకున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం వెలుగుజూసింది.
నిజామాబాద్ నగర సీఐ సుభాష్ చంద్రబోస్ వివరాల ప్రకారం..నిజామాబాద్లోని కోటగల్లికి చెందిన బాలిక(15) పదో తరగతి చదువుతున్నది. ఇంటి పక్కనే ఉండే ఇంటర్ పూర్తయిన విద్యార్థి(17)తో స్నేహం ఏర్పడింది. ఏప్రిల్లో బాలిక పుట్టిన రోజు సందర్భంగా యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. అక్కడ కేక్ కట్ చేయించారు. అందరూ కలిసి మొబైల్లో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసిన యువకుడు బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టాడు. ఇది జరిగిన రెండుమూడ్రోజుల తర్వాత బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీన్ని రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియోను స్నేహితులకు వాట్సాప్లో షేర్ చేశాడు. దాన్ని అడ్డుపెట్టుకుని తాను చెప్పినట్టు చేయాలని, లేదంటే వీడియోను నెట్లో పెడతానని రోజూ లైంగికంగా వేధిస్తున్నాడు. ఇటీవల గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చిన బాలిక తండ్రి కుమార్తె ప్రవర్తన అనుమానంగా ఉండటం, ఆ యువకుని నుంచి ఎక్కువగా ఫోన్లు రావడాన్ని గమనించాడు. ఆమెను ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. మొబైల్లోని ఫొటోలను, వీడియోలను తొలగించాలని యువకున్ని హెచ్చరించాడు. అందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో ఆ ఫోన్ను లాక్కుని ఓ దుకాణానికి తీసుకెళ్లి అన్లాక్ చేయించాడు. అందులో ఉన్న తన కుమార్తె అసభ్య చిత్రాలు, వీడియోలను చూసిన కుటుంబీకులు కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బాలిక తరడ్రి నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాలిక వాగ్మూలం తీసుకుని పోక్సో చట్టం కింద 3 క్రాస్ ఏ అండ్ 4, 376 ఐపీసీ సెక్షన్ల కింద యువకునిపై కేసు నమోదు చేశారు. యువకుని సెల్ఫోన్ను స్వాధీన పర్చుకున్నారు. నిందితున్ని రిమాండ్కు తరలించారు. బాలికను సంరక్షణ నిమిత్తం స్వధార్ గృహానికి తరలించినట్టు సీఐ వెల్లడించారు.