Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్కుమార్
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
విభజన హామీలో భాగంగా బయ్యా రంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో కడపలో ఉక్కుఫ్యాక్టరీ కోసం అధికార పార్టీ నిరాహార దీక్షలు చేస్తుంటే, అన్ని వసతులున్న బయ్యారంలో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కృషి చేయడం లేదని విమ ర్శించారు. సోమవారం ఎన్టీఆర్ భవన్లో టీడీపీటీఎస్ ఎల్ రమణ అధ్యక్షతన పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరవింద్కుమార్ గౌడ్ మాట్లాడారు. ఎంపీ గరికపాటి మోహన్రావు నేతృత్వంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఈనెల 27న 'చలో ములుగు' నిర్వహిస్తామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి మాట్లాడారు.