Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు ప్రాజెక్టులకు నిధుల కొరత లేదు..: మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలోని ఐదు ముఖ్యమైన ప్రాజెక్టుల పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా ప్రాజెక్టు పనులకు నిధుల కొరత లేదని. పనుల ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం జలసౌధలో పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం లోని మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఫ్రెషర్ మైన్స్ పనులు జాగ్రత్తగా చేయాలని, ఏక్కడా లీకులు లేకుండా చూసూకోవలన్నారు. మోబైల్ క్రేన్ ద్వారా మోటార్లు బిగించే పనులు చేయాలన్నారు. ఆగష్టు 31 లోగా ఒక పంపును ప్రారంభించే విధంగా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో 300, కోయిల్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 200 ఎకరాల వరకు భూసేకరణ జరపాల్సి ఉందని మంత్రికి ప్రాజెక్టు ఇంజనీర్లు తెలపగా, అప్పటికప్పుడే మంత్రి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్తో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం సమావేశం నిర్వహించి భూసేకరణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశానికి ప్రాజెక్టు ఇంజనీర్లు, రెవెన్యూ అధికా రులు పాల్గొంటారని, సీఈ, ఎస్ఈ లు హజరయి...భూసేకరణ వేగంగా జరిగేలా చూడాలన్నారు. ఫీల్డ్ ఛాన ల్స్ తవ్వే విషయంలో గ్రామస్థులు సహకరించడం లేదని ఇంజనీర్లు మంత్రి దృష్టికి తేవడంతో, వెంటనే జిల్లా కలెక్టర్లు, రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఫీల్డ్ చానల్స్ పూర్తి చేసి చివర ఆయకట్టు వరకు నీరు ఇచ్చేలా చూడాలన్నారు. ప్యాకేజీ 107 లో భూసేకరణ పూర్తయిన చోట అన్ని స్ట్రక్చర్లు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. మరో 271 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఈ ప్యాకేజీ లోని ఫీల్డ్ ఛానల్ పనులు పూర్తి చేయాలని సూచించారు.
శ్రీశైలం జలాశయానికి నీరు వచ్చిన వెంటనే
కల్వకుర్తికి విడుదల చేయాలి..
శ్రీశైలం జలాశయానికి నీరు వచ్చిన వెంటనే కల్వకుర్తి మోటార్లు ప్రారంభించి నీరు విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులపైన సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ 28లో 30 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. భూసేకరణ పూర్తి చేసి పనుల వేగం పెంచాలన్నారు. ఈ ప్యాకేజీ పరిధిలోని ఫీల్డ్ ఛానల్స్ ను వేగంగా పూర్తి చేయాలని ఇంజనీర్లకు సూచించారు. ప్యాకేజీ 30 లో పెండింగ్ లో ఉన్న స్ట్రక్చర్లు, ఫీల్డ్ ఛానల్స్ పూర్తి చేయాలన్నారు. తుంగభద్ర నుంచి నీరు వచ్చే అవకాశం ఉండటంతో కార్మికులను పెంచి రాత్రింబవళ్లు పనులు చేయాలని ఆదేశించారు.