Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమీకత మత్స్య అభివద్ధి పథకం క్రింద 1000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. గతంలో ఈ శాఖకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేయలేదన్నారు.. మత్స్యకారులకు 75 నుండి 100 శాతం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రక్లను అందించడం జరుగుతుంది. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుదని అన్నారు. ఈ సంవత్సరం అన్ని నీటి వనరులలో 80 కోట్ల చేపపిల్లలను విడుదల చేస్తామని చెప్పారు. ఈ నెలాఖరు నుండి చేపపిల్లల పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. గత సంవత్సరం ప్రయోగాత్మకంగా 11 రిజర్వాయర్లలో కోటి 34 లక్షల ఖర్చుతో రొయ్యల పెంపకం చేపట్టగా రూ. 8 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ఈ సంవత్సరం 23 రిజర్వాయర్లలో రొయ్యల పెంపకానికి చర్యలు చేపట్టాలనే సీఎం ఆలోచన అని చెప్పారు. కులవత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేయుతనిస్తుందని, గొర్రెలు, చేపల పంపిణీని విమర్శించడం అంటే ఆయా సామాజిక వర్గాలను అవమానించడమే అని అన్నారు.