Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) తుదివిడత కౌన్సెలింగ్ ఈనెల 21వ తేదీ నుంచి జరగనుంది. ఈ మేరకు పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 21న బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో చేరే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఈనెల 22,23 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. ఈనెల 25న రెండు కోర్సులకు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈనెల 30 నాటికి కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు చేరాలని కోరారు. కాలేజీల్లో మిగిలిపోయిన ఖాళీ సీట్ల వివరాలను కన్వీనర్ కార్యాలయానికి యాజమాన్యాలు పంపిం చేందుకు తుదిగడువు ఈనెల 31వ తేదీ వరకు ఉందని తెలిపారు.