Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం, సీఐటీయు, వ్యకాస నేతల వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతుసంఘం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయు సంయుక్తం గా నిర్వహిస్తున్న జైల్భరో (ఆగస్టు 9న), మజ్దూర్- కిసాన్ సంఘర్ష్ ర్యాలీ (సెప్టెంబరు 5న-చలో పార్లమెంటు) కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయా సంఘాల రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. వీటిని విజయవంతం చేయాలని కోరుతూ ఈనెల 25న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్.సాయిబాబు మాట్లా డుతూ.. సదస్సుకు కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వ చైర్మెన్, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజయ రాఘవన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ సదస్సులో అత్యధి క సంఖ్యలో పాల్గొ ని జయప్రదం చేయాలని ప్రజానీ కానికి ఆయన విజ్ఞప్తి చేశారు. క్విట్ ఇండియా డే స్ఫూర్తితో ఆగస్టు 9న జైల్భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలి పారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎన్నికల సమ యంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు, భూస్వామ్య పెత్తందారులకు ఆయా ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మోడీ, కేసీఆర్ ఇచ్చిన హామీల అమ లుకోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిం చారు. ఇందులో భాగంగానే 25న రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశం లో రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు, రాష్ట్ర నాయకులు డి.పద్మ, సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి కూడా పాల్గొన్నారు.