Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మృతీఇరానీకి కేటీఆర్ వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
రాష్ట్ర చేనేత రంగానికి చేయూతనివ్వాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతీఇరానీని మంత్రి కేటీఆర్ కోరారు. మంగళవారం ఢిల్లీకి వచ్చిన కేటీఆర్... కేంద్రమంత్రి స్మృతీఇరానీని ఆమె కార్యాలయంలో కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.1200 కోట్లు బడ్జెట్ కేటాయించామని చెప్పారు. అయితే రాష్ట్రానికి కొత్తగా పది క్లస్టర్లు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. వీటివల్ల ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు ప్రయోజనం జరుగుతుందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాష్ట్రంలో మరమగ్గాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామని, 50 శాతం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని కేటీఆర్ సమావేశనంతరం మీడియాతో చెప్పారు. అయితే మరమగ్గాల ఆధునీకరణకు కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్న నిధుల ను వెంటనే విడుదల చేయాలని కోరారు.
కేంద్రజౌళి, చేనేత మంత్రిత్వశాఖ నుంచి తెలంగాణకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వెంట ఎంపీలు జితేందర్రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, రామచంద్రుతేజావత్, తెలంగాణ భవన్ ఆర్సీ అశోక్కుమార్ ఉన్నారు.