Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీచేసిన ఆర్థికశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పురపాలకశాఖలో 111 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని పేర్కొంటూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్ శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పురపాలకశాఖ పబ్లిక్ హెల్త్ విభాగంలో 87 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (ఏఈఈ), మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఎంఏఈ) 24 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేయాలని ఆదేశించారు.