Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు విద్యార్థులు మృతి
నవతెలంగాణ-ఆర్మూర్
ఆర్టీసీ బస్సు, బైక్ ఢకొీన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడి కక్కడే మృతిచెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ సమీపంలోని దోబీఘాట్వద్ద గురు వారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ పట్టణం లోని సుభాష్నగర్కు చెందిన సునిల్(21) నరేంద్ర జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నల్ల యోగేశ్(19) మండలంలోని పెర్కిట్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. సుభాష్నగర్ కాలనీలోని గణేష్ మండపం వద్ద గురువారం అన్నదానం నిర్వహించేందుకు సరుకుల కోసం సునిల్, యోగేశ్ ద్విచక్రవాహనంపై బయల్దేరారు. నిర్మల్ డిపోకు చెందిన బస్సు ఆర్మూర్ నుంచి నిజామాబాద్కు బయల్దేరింది. ఈ క్రమంలో పట్టణంలోని దోబీఘాట్ వద్దకు రాగానే ద్విచక్రవాహనంపై వస్తున్న విద్యార్థులను బలంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో సునిల్, యోగేశ్ తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.