Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్కు గుణపాఠం తప్పదు: టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల
నవతెలంగాణ - జనగామ ప్రతినిధి
ఎన్నికల తర్వాత కేసీఆర్ సెంట్రల్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనే ఆయనను జైల్కు పంపిస్తాయన్నారు. జనగామలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో గురువారం మాట్లాడారు. కేసీఆర్ మాటలు తప్ప పనులు చేయడం లేదని విమర్శించారు. ముందస్తు ఎన్నికలు ఎందుకు తెచ్చారన్న ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్ విమర్శల వల్లే ఎన్నికలు తెచ్చామని చెప్పడం హాస్యాస్ప దమన్నారు. కాంగ్రెస్ హయాం లో 50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, ఇప్పటికీ ఇండ్లు కట్టుకున్న అనేక మందికి డబ్బులు ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడె కరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీలు ఏమయ్యా యని ప్రశ్నించారు. కేసీఆర్ దత్తత గ్రామంలోనూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో రజాకార్లను మించిన దుశ్చర్యలు జరుగు తున్నా యన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్కు ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఇసుక, డ్రగ్స్, పబ్ మాఫియాలు టీఆర్ఎస్కు కేంద్రంగా ఉన్నా యన్నారు. కేంద్రంలోని బీజేపీ 100 రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని ప్రగల్బాలు పలికి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల్ని రోజుకురోజుకూ పెంచుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విలేకర్ల సమా వేశంలో కాంగ్రెస్ నాయకులు చెంచారపు శ్రీనివాస్రెడ్డి, ఎండీ అన్వర్, చెంచారపు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.