Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని ఒంటరి చేద్దాం.. కాషాయ దళాన్ని ఓడించటమే మన లక్ష్యం... : సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు రాఘవులు
- బీజేపీని ఒంటరి చేద్దాం..
- ఎన్నికలను ఎంటర్టైన్మెంట్గా మార్చిన బూర్జువా పార్టీలు : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) కీలకమని, దాన్ని బలోపేతం చేయడమే మార్గమని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. తద్వారా వామపక్ష, సామాజిక శక్తులను ప్రత్యామ్నాయ శక్తులుగా సమీకరించడం సాధ్యమని చెప్పారు. ఎలాంటి కారణం లేకుండా, అహేతుకంగా మతాలను, ప్రజలను రెచ్చగొట్టటం బీ జేపీకి ఆనవా యితీగా మారిందని ఆందోళన వ్యక్తం చే శారు. కోరే గావ్లాంటి సంఘటనల్లో అర్బన్ నక్సల్స్ అనే పదాల ను ఉపయోగించటం, మూక దాడులకు తెగబడటం ద్వారా బీజేపీ, ఆరెస్సెస్ దేశంలో అరాచకాన్ని సృష్టిస్తు న్నాయని చెప్పారు. ఆ పార్టీ వల్ల దేశంలో లౌకికత్వం, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నదని హెచ్చరి ంచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ఎన్నిక ల్లోనూ, ఆ తర్వాత జరగబోయే పార్లమెంటు ఎలక్షన్ల లోనూ బీజేపీని ఒంటరిపాటు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ పార్టీని ఓడించ టమే లక్ష్యంగా పని చేయాలని దిశా,నిర్దేశం చేశారు. తద్వారా ప్రత్యామ్నాయ శక్తులను సంఘటితం చేయా లని సూచించారు.
బుధవారం హైదరాబాద్లో సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు ప్రారంభోపన్యాసం చేస్తూ... బీజేపీ దేశభక్తి అంటే అమెరికా పట్ల ఆ పార్టీకున్న భక్తి అని వ్యాఖ్యాని ంచారు. నాలుగేండ్ల మోడీ పాలనలో దేశం సామాజి కంగా, ఆర్థికంగా ధ్వంసమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరల పెంపు తదితర అంశాలు దేశ ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నీ అమలు చేయలేదని... దీంతో జనాల్లో తీవ్రమైన అసంతప్తి నెలకొందని అన్నారు. ఈ నేపథ్యంలో సమ స్యలను పక్కదారి పట్టించేందుకోసం అయోధ్యలో రామమందిరం, త్రిపుల్ తలాక్, అర్బన్ నక్సల్స్ అనే అంశాలను ముందుకు తెస్తున్నారని హెచ్చరించారు. అందువల్ల ఆ పార్టీపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో బీజేపీని ఓడించటమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఇందుకోసం సీపీఐ (ఎం) ఎలాంటి త్యాగా లకైనా సిద్ధపడుతుందని చెప్పారు.
మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రాలన్నీ బిచ్చమెచ్చుకునే దీనస్థితికి దిగజా రుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేండ్ల కాలంలో అనేక కార్మిక చట్టాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ నానాటికీ పడిపోతున్నదని చెప్పారు. ఈ పరి స్థితిని చక్కదిద్దే వారే లేకపోయారని అన్నారు. కుంబ కోణాల్లో బీజేపీ గత కాంగ్రెస్ను మించిపోయిందని తెలిపారు. రాఫెల్ అనేది దేశ చరిత్రలో కనివినీ ఎరు గని అతి పెద్ద కుంభకోణమని తెలిపారు. అసలు ఏ రాష్ట్రంలోనూ స్థాపించని రిలయన్స్ యూనివర్సిటీకి మోడీ సర్కారు వెయ్యి కోట్లు అప్పుగా ఇచ్చిందని గుర్తు చేశారు. నీరవ్ మోడీని విదేశాలకు పంపింది ఎవరని ప్రశ్నించారు. మతం, కులం పేరిట దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం లేకుండా, అహేతు కంగా జాతిని, మతాన్ని రెచ్చగొట్టటం బీజేపీకి ఆనవా యితీగా మారిందన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడించాలని పిలుపునిచ్చారు.
మరోవైపు తెలంగాణలో సీఎం కేసీఆర్ పెద్ద నోట్ల రద్దుకు, జీఎస్టీకి మద్దతునిచ్చారని రాఘవులు చెప్పారు. ఆ ప్రకారంగా తొలుత బీజేపీకి జై కొట్టిన ఆయన ఇప్పుడు వాళ్లు వెంట పడుతుండటంతో వెనక్కి తిరిగి చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు నాలుగేండ్లపాటు బీజేపీతో అంటగాగిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇప్పడు మేం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామంటూ చెబితే ఎవరు నమ్ము తారని ప్రశ్నించారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితు ల్లోనూ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహాకూటమిలో చేరబోయేది లేదని ఆయన తేల్చి చెప్పారు. బీఎల్ఎఫ్ ను బలోపేతం చేయడం ద్వారా వామపక్ష, సామాజిక శక్తులను సమీకరించగలమని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో కూడా బీజేపీని గద్దెదించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఇదే సమయంలో పార్టీ స్వతంత్రతను కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్, మహాకూటమి, బీఎల్ఎఫ్, బీజేపీ మధ్య చతుర్ముఖ పోటీ జరగబోతున్నదని తెలిపారు. మిగ తా పార్టీలకు అంగబలం, అర్థబలం ఉంటే బీఎల్ఎఫ్ కుకు తన విధానాలే బలమని చెప్పారు. బహుజ నులకు రాజ్యాధికారమే బీఎల్ఎఫ్ లక్ష్యమని తెలిపారు. అందుకోసం ఎన్నాళ్లైనా... ఎన్నేండ్లయినా పోరాడతామని తెలిపారు. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు ఏం ఒరగబెట్టింద ని ప్రశ్నించారు. ఈ ప్రాంతం వెనుకబాటుకు కారణం కాంగ్రెసేనని విమర్శించారు. అలాంటి పార్టీ నేత త్వంలోని మహా కూటమి రాష్ట్ర ప్రజల అభివద్ధికి అవసరమైన అజెండాను, ప్రణాళికను రూపొందించ గలుగుతుందా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం వివిధ బూర్జువా పార్టీలు ఎన్నికలను టిక్కెట్ లేకుండా చూసే ఎంటర్టైన్మెంట్లాగా మార్చేశాయని చెప్పా రు. బూతులు, తిట్ల పురాణాలతో ఆయా పార్టీల నేతలు దిగజారుతున్నారని విమర్శించారు. రాష్ట్ర శాసనసభకు జరగబోయే ఎన్నికలు ధన బలానికి, జన బలానికి.. కార్పొరేట్కు, కామన్ మ్యాన్కు జరగ బోయే ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. ఈ ఎన్నికల బరిలో నిలబడి.. సామాజిక న్యాయమనే అంశాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య స్వాగతోపన్యాసం చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి, భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి మిడియం బాబూరావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జ్యోతి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులందరూ పాల్గొన్నారు.