Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంథని
పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని వాగుగడ్డవీధికి చెందిన యువతి డెంగ్యూతో గురువారం మృతిచెందింది. మృతురాలి కుటుంబీకులు వివరాల ప్రకారం.. తాటి రమేష్-లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు సింధూజ(18) ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు చేస్తోంది. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.