Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస పరిజ్ఞానంలేని ఉత్తమ్ : ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్ అనేది టీడీపీకి కట్టుబానిసలా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. కెప్టెన్గా పని చేశానని చెప్పుకుంటున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్.. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి హరీశ్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఆయన అమరావతి నుంచి వచ్చిన స్క్రిప్టును చదివారని విమర్శించారు. డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారని దుయ్యబట్టారు. గురువారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెస్ ప్రభాకరరావుతో కలిసి కర్నె మీడియాతో మాట్లాడారు. విభజన హామీల అమలుకోసం తమ పార్టీ ఎప్పట్నుంచో పోరాడుతున్నదని తెలిపారు. నదీ జలాల పంపకం పై ఉత్తమ్కు కనీస అవగాహన లేదనే విషయం తేలిపోయిందన్నారు. సైన్యంలో కెప్టెన్గా పనిచేశానని చెప్పుకునే ఆయనకు కనీస పరిజ్ఞానం లేదని విమర్శించారు. నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తే పరిష్కరించడానికి అపెక్స్ బాడీ ఉందని గుర్తు చేశారు. ఆ బాడీ ముందు చంద్రబాబు తెలంగాణకు నీటిని కేటాయించటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. ఉత్తమ్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబుకు వత్తాసు పలికారని విమర్శించారు. అన్ని అను మతులున్న సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతుంటే.. ఉత్తమ్ దాన్ని సమర్దిస్తు న్నారని విమర్శించారు. ఆయన ఓ అవివేకిలాగా, చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో దామరచర్ల పవర్ ప్లాంట్ను కోమటిరెడ్డి, ఉత్తమ్ వ్యతిరేకించడం దారుణమని అన్నారు. తెలంగాణకు మేలు చేసే ప్రాజెక్టును వ్యతిరేకించడం సిగ్గు చేటని మండిపడ్డారు.