Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్షులు ఎండీ సర్ధార్
- మ్యానిఫెస్టోలో చేర్చాలని పార్టీలకు వినతిపత్రాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో పని చేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పీఏసీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ సర్ధార్, ప్రధాన కార్యదర్శి పి ఈశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాలని కోరుతూ యూనియన్ నేతలు టి వీరభద్రం, వెంకట్రావు, పి నరేందర్రెడ్డి, గణేష్, ఆశ్వరప్ప, బి వెంకట్రెడ్డి, అశోక్రెడ్డి, సంజీవరెడ్డి, విజరుకుమార్, ఎస్ శ్రీనివాస్, వెంకటస్వామి తదితరులు వివిధ రాజకీయ పార్టీలను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులకు, ఉద్యోగ భద్రత, పీఆర్సీ, పదవి విరమణ బెనిఫిట్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలు బలోపేతం చేయడానికి రైతులకు అందించే ప్రభుత్వ పథకాలు పీఏసీఎస్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. రైతులు దీర్ఘకాలిక రుణాలు సకాలంలో తిరిగి చెల్లించే వారికి 6శాతం వడ్డీ రాయితీ పునరుద్ధరించాలని, రుణమాఫీ మొత్తం ఏకకాలంలోనే మాఫీ చేయాలని, పంట రుణాలే కాకుండా దీర్ఘకాలిక రుణాలు కూడా మాఫీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేశారు.