Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డీసెట్) రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ రమణకుమార్ సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ), డీసెట్లో మిగిలిన సీట్లు, కేటాయించినా చేరని సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముందని తెలిపారు. ఈనెల 30న సీట్లు కేటాయించడంతోపాటు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఈనెల 31 నాటికి కేటాయించిన కాలేజీల్లో చేరాలని సూచించారు.