Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వెంకటాపూర్
టీఆర్ఎస్ అసమ్మతి నాయకులపై మాజీ మంత్రి చందూలాల్ అనుచరులు సోమవారం దాడి చేశారు. రెండు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్లో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు మంగళవారం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సభ విజయవంతం కోసం సోమవారం మండలంలో ప్రచారం చేశారు. సభ అనుమతి కోసం రాత్రి వెంకటాపూర్ పోలీస్స్టేషన్కు మూడు వాహనాల్లో పోరిక గోవింద్నాయక్, సకినాల శోభన్ తదితరులు వస్తున్నారు. నల్లగుంట గ్రామం వద్ద మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్, చందూలాల్ తనయుడు ప్రహ్లాద్ అనుచరులు వారి వాహనాలను ఆపి దాడికి దిగారు. రెండు వాహనాల అద్దాలను పగలగొట్టారు. ఒక వాహనంలో గాలి తీసి బోర్లా పడేశారు. ఈ ఘటనపై వెంకటాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. వాహనాలను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ బుక్యా నరహరి తెలిపారు.