Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/మద్నూర్
హైదరాబాద్ నగరంలోనూ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో నూ వేర్వేరు చోట్ల సోమవారం చేపట్టిన తనిఖీల్లో రూ.82.49 లక్షల నగదును పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం... ఎన్నికల కమిష న్ ఆదేశాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు హైదరాబాద్లో డబ్బులు తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. జూబ్లీహిల్స్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రామ చందర్రావు అనేవ్యక్తి వద్ద రూ.4.85లక్షలు లభించాయి. షాహినాజ్గం జ్లో పవన్వ్యాస్ అనే వ్యక్తి నుంచి రూ.60 లక్షలు లభ్యమయ్యాయి. బేగంబజార్ ప్రాంతంలో బ్రిటీష్ తివారీ అనే వ్యక్తి నుంచి రూ.9.97 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు చోట్ల మొత్తం రూ.74.82 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద రెవెన్యూ, పోలీస్శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రలోని ముఖేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో రూ.8,49,600లను పోలీసులు గుర్తించారు.