Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యంతో భార్య మృతి..శ్మశానవాటిక వద్దే కుప్పకూలిన భర్త
- పక్కనే చితిపేర్చి దంపతులకు అంత్యక్రియలు
- మెదక్ జిల్లా కేంద్రంలో ఘటన
నవతెలంగాణ-మెదక్డెస్క్
ఏడడుగుల సాక్షిగా తనతో నడిచిన భార్య చనిపోయింది. డదాక తోడుంటానని ఇచ్చిన ఆమెకిచ్చిన మాట భర్త తప్పలేదు. జీవిత భాగస్వామి మృతిని తట్టుకోలేక పోయాడు. భార్య దహన సంస్కారాల కోసం శ్మశానవాటికకు తీసుకెళ్లగా తానూ అక్కడే కుప్ప కూలి మృతిచెందాడు. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది.స్థానికుల వివరాల ప్రకారం...పట్టణంలో ఫతేనగర్ బాలాజీ మఠం ఎదురుగా చలేంద్రి గోవింద్ (75), చలేంద్రి సబిత (65) దంపతులు చాలా కాలం నుంచి ఉంటున్నారు. ఈ క్రమంలో సబిత అనారోగ్యంతో తెల్లవారు జామున ఇంట్లో మృతి చెందింది. గమనించిన చుట్టుపక్కలవారు వారి బంధువులకు సమాచారమందించారు. సాయంత్రం ఆమె అంత్యక్రియలను మల్లెంచెరువు వద్ద ఆర్యవైశ్య శ్మశాన వాటిక వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న మతురాలి భర్త గోవింద్ను కూడా కుటుంబ సభ్యులు ఆటోలో శ్మశానవాటిక వద్దకు తీసుకొచ్చారు. సబిత చితికి నిప్పంటించేందుకు భర్తను కుటుంబ సభ్యులు సన్నద్ధం చేస్తున్న తరుణం లోనే ఒక్కసారిగా గోవింద్ కూడా కుప్పకూలి అక్కడే చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వెంటనే అప్పటికప్పుడు కట్టెలను తెప్పించి భార్య చితి పక్కనే అతన్నీ దహనం చేశారు. ఈ దంపతులకు సంతానం లేకపోవడంతో గోవింద్ అన్న కొడుకు కష్ణ వృద్ధుల చితికి నిప్పటించాడు. గంటల వ్యవధిలోనే దంపతులు మతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది.