Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓట్ల పండగ కదా! నేతలకు ఉన్నదున్నట్టుండి ప్రజలపై మస్తు ప్రేమ పుట్టుకొస్తున్నది. ఊర్లదొవ్వ బడుతున్నరు. ఇగ ఏడ ప్రజల నిలదీస్తరో..పస్నిస్తరో అని ముందుగాల్నే హోటళ్లలో టీ పెడుతూ..ఇస్త్రీ చేస్తూ...కూరగాయలు అమ్ముతూ...సెలూన్లలో కటింగ్ చేస్తూ ప్రజాపక్షమని షో ఇస్తున్నరు. అహో..ఓహో అనేలా పేపర్లకు ఎక్కుతున్నరు. గసోంటి దాంట్ల స్పీకర్ మధుసూదనాచారీ ఎప్పుడూ ముందల్నే ఉంటడు. గా సారు గియ్యాల భూపాలపల్లిలో ప్రచారానికి పోయిండు. తొవ్వపొంటి బోతుంటే మంచం మీద గూసోని బువ్వ దింటున్న ఓ పెద్దాయన కనిపించిండు. గంతే చారి సారు గాడికురికిండు. తలెల నుంచి బుక్కెడు బువ్వ దీసుకున్నడు. పెద్దాయన నోట్ల కుక్కిండు. నీ మంచి చెడు జూసెటోన్నే. జర మర్సిపోకే..ఓటెయ్యే అన్న అంటూ వేడుకున్నడు. ఏం జరుగుతుందో తెల్వక గా పెద్దాయనతో పాటు అక్కడున్నోళ్లంత అవాక్కయిండ్రు. ఎన్నికలయ్యే సరికి గిసోంటి సిత్రాలు ఎన్నిజూడాల్నో ఏమో!
- వై.సతీష్, భూపాలపల్లి.