Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి / సిటీబ్యూరో
సూర్యా పేట జిల్లా తిరుమలగిరిలో, సిద్దిపేట జిల్లా, హైదరాబాద్లో పలుచోట్ల ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.85లక్షల నగదును మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. .సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని చెక్పోస్టు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ. 30లక్షలు పట్టుబడ్డాయి. జనగామ జిల్లా కేంద్రం నుంచి కారులో తిరుమలగిరి మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌళ్ల రామారంలోని సాయి శ్రీనివాస జిన్నింగ్ మిల్లుకు ఈ డబ్బులు తరలిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్లోని సుల్తాన్బజార్లో వాహనాలు తనిఖీ చేపట్టారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నీలేశ్ అనే యువకు ని వద్ద నుంచి రూ.14 లక్షలా 49 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్లో సుశీల్ అనే వ్యక్తి కారును ఆపి తనిఖీ చేయగా ఆయన వద్ద నుంచి రూ.35 లక్షలు లభించాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంట వాగు చెక్పోస్టు వద్ద చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి ఆధారాల్లేని రూ.6 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.