Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ టీచర్ ఇంట్లో రూ.22 లక్షలు స్వాధీనం
నవతెలంగాణ - మంథని
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ నడివీధిలోని ఓ అంగన్వాడీ టీచర్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం దాడి చేయడం సంచలనం సృష్టించింది. మంథని మండలం గుమ్మునూరు అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా పనిచేస్తున్న వరహాల సత్యభామ ఇంట్లో భారీగా నగదు ఉందనే ఫిర్యాదుతో కరీంనగర్ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఆరుగురు బృందంతో కూడిన అధికారులు ఉదయం 11గంటలకే అక్కడికి వచ్చారు. మంథని ఎన్నికల మానిటరింగ్ కమిటీతో కలిసి సుమారు ఎనిమిది గంటలపాటు సోదాలు చేశారు. రూ.22 లక్షలను ఐటీ అధికారులు సీజ్ చేసినట్టు ఎన్నికల మానిటరింగ్ కమిటీ కన్వీనర్, కమాన్పూర్ ఎంపీడీఓ పురుషోత్తం తెలిపారు.