Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ అసమ్మతి నేతల పల్లెబాట
నవతెలంగాణ-ఊట్కూర్
మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు మంగళవారం పల్లెబాట చేపట్టారు. టీఆర్ఎస్ అస్మమతి నేతలు జలందర్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎల్కోటి జనార్దన్రెడ్డి, బంగ్ల లక్ష్మీకాంత్రెడ్డి, రాజుఆశిరెడ్డి ఊట్కూర్ మండలంలోని వల్లంపల్లి, ఓబ్లాపూర్, అమిన్పూర్ గ్రామాల్లో తిరుగుతూ రాంమోహన్రెడ్డికి ఓటేయొద్దని ప్రచారం చేశారు. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధీ చేయలేదని, సమస్యలపై మాట్లాడితే పట్టించుకోలేదని చెప్పారు. ఓట్లు అడిగేందుకు వస్తే తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. చిట్టెం రాంమోహన్రెడ్డికి ఓటు వేయకూడదని ప్రతిజ్ఞ చేయించారు.